Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (11:55 IST)
ఏలూరులో ఓ విషాదం చోటుచేసుకుంది. కారు ఒకటి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. మొత్తం 10 మంది విద్యార్థులు రెండు కార్లలో విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా, బూరుగుపూడి సమీపంలో కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పు గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని రామచంద్రా ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన మూడో సంవత్సరం చదువుతున్న పది మంది విద్యార్థులు రెండు కార్లలో విహారయాత్రకు వెళ్లారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి సమీపంలోని గుడిసె పర్యాటక ప్రాంతానికి వెళ్లి గడిపి, తిరిగి మళ్లీ బయలుదేరారు. 
 
అర్థరాత్రి దాటిన తర్వాత బూరుగుపూడి సమీపంలో ఓ కారు అదుపుతప్ప పాత కొత్త వంతెనల మధ్య కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఉదయ్ కిరణ్, హర్షవర్థన్, హేమంత్ అనే ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments