Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (11:55 IST)
ఏలూరులో ఓ విషాదం చోటుచేసుకుంది. కారు ఒకటి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. మొత్తం 10 మంది విద్యార్థులు రెండు కార్లలో విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా, బూరుగుపూడి సమీపంలో కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పు గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని రామచంద్రా ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన మూడో సంవత్సరం చదువుతున్న పది మంది విద్యార్థులు రెండు కార్లలో విహారయాత్రకు వెళ్లారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి సమీపంలోని గుడిసె పర్యాటక ప్రాంతానికి వెళ్లి గడిపి, తిరిగి మళ్లీ బయలుదేరారు. 
 
అర్థరాత్రి దాటిన తర్వాత బూరుగుపూడి సమీపంలో ఓ కారు అదుపుతప్ప పాత కొత్త వంతెనల మధ్య కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఉదయ్ కిరణ్, హర్షవర్థన్, హేమంత్ అనే ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments