Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూ లెట్ బోర్డు పెడితో బాదుడే : షాకిస్తున్న జీహెచ్ఎంసీ

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (08:32 IST)
భాగ్యనగరి వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తేరుకోలని షాకిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారం టు లెట్ బోర్డులు పెట్టే వారిపై కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటికే ఈ తరహా హెచ్చరిక చేసింది. తమ హెచ్చరికలను బేఖాతర్ చేస్తే వారిపై షాకిచ్చేలా జీహెచ్ఎంసీ కార్యరంగంలోకి దిగింది. తాజాగా మూసాపేట డివిజన్ పరిధిలో ఓ దుకాణ యజమానికి రూ.2 వేల జరిమానా విధించింది.
 
మోతీనగర్ పరిధిలోని పాండురంగ నగర్ చౌరస్తాలో స్థానిక వ్యాపారి ఎరమల్ల లాలయ్యగౌడ్ దుకాణం కోసం ఓ గదిని అద్దెకు ఇచ్చేందుకు ‘టు లెట్’ బోర్డు తగిలించారు. దీన్ని నేరంగా పరిగణించిన జీహెచ్ఎంసీ ఈడీ, డీఎం డైరెక్టర్ రూ.2 వేల జరిమానా విధిస్తూ మంగళవారం నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా ఈ-చలానా ద్వారా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
 
కాగా, టు లెట్ బోర్డులపై జరిమానా విధించనున్నట్టు జీహెచ్ఎంసీ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా టులెట్ బోర్డులు, పోస్టర్లు ఏర్పాటు చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయితే, ఈ విషయంలో స్పష్టత లేకపోవడంతో జనంలో గందరగోళం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments