Webdunia - Bharat's app for daily news and videos

Install App

భువనగిరిలో చిన్నారి మృతి.. అటవీ జంతువులు చిదిమేశాయి..

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (19:04 IST)
యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగేళ్ల వయసున్న ఓ చిన్నారి బాలుడ్ని అటవీ జంతువులు చంపేశాయి. చిన్నారి తలను తీవ్రంగా కొరికి చిదిమేశాయి. దీంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం వాసాల మర్రి గ్రామ శివారులో చిత్తూరు జిల్లా వాపన్‌ పల్లి కాలనీకి చెందిన శివ, అతని కొడుకు హరీశ్ కుటుంబంతో సహా వలసవచ్చారు. 
 
వీరు చుట్టుపక్కల ఊర్లలో కోళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. హరీశ్‌కు భార్య గంగోత్రి, కొడుకు నాలుగేళ్ల మునేశ్వర్ రావు ఉన్నారు. రోజూలాగే బుధవారం సాయంత్రం కూడా వీరు కోళ్లు అమ్ముకుని వచ్చారు.
 
రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి పూట పిల్లాడు ఏడవడంతో తల్లి గంగోత్రి నిద్రలేచి, పాలిచ్చింది. తర్వాత మళ్లీ నిద్రపోయారు. మళ్లీ తల్లి ఉదయం 5 గంటలకు లేచి చూసేసరికి దారుణం కనిపించింది. విగతజీవిగా మారిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.  

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments