Webdunia - Bharat's app for daily news and videos

Install App

భువనగిరిలో చిన్నారి మృతి.. అటవీ జంతువులు చిదిమేశాయి..

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (19:04 IST)
యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగేళ్ల వయసున్న ఓ చిన్నారి బాలుడ్ని అటవీ జంతువులు చంపేశాయి. చిన్నారి తలను తీవ్రంగా కొరికి చిదిమేశాయి. దీంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం వాసాల మర్రి గ్రామ శివారులో చిత్తూరు జిల్లా వాపన్‌ పల్లి కాలనీకి చెందిన శివ, అతని కొడుకు హరీశ్ కుటుంబంతో సహా వలసవచ్చారు. 
 
వీరు చుట్టుపక్కల ఊర్లలో కోళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. హరీశ్‌కు భార్య గంగోత్రి, కొడుకు నాలుగేళ్ల మునేశ్వర్ రావు ఉన్నారు. రోజూలాగే బుధవారం సాయంత్రం కూడా వీరు కోళ్లు అమ్ముకుని వచ్చారు.
 
రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి పూట పిల్లాడు ఏడవడంతో తల్లి గంగోత్రి నిద్రలేచి, పాలిచ్చింది. తర్వాత మళ్లీ నిద్రపోయారు. మళ్లీ తల్లి ఉదయం 5 గంటలకు లేచి చూసేసరికి దారుణం కనిపించింది. విగతజీవిగా మారిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments