Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో వ్యభిచారం.. ఉగాండా ముఠా అరెస్ట్..

Webdunia
శనివారం, 22 మే 2021 (12:31 IST)
పర్యాటక వీసాపై ఇండియా వచ్చి ఇక్కడ ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఉగాండాకు చెందిన ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
లోకాంటో డేటింగ్ యాప్ ద్వారా ఆన్ లైన్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఉగాండాకు చెందిన ఐదుగురు మహిళలను చైతన్యపురి పోలీసులతో కలిసి రాచకొండ యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్దనుంచి 20 గ్రాముల కెటామైన్ తో పాటు ఇతర మాదకద్రవ్యాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ ముఠా లోకాంటో డేటింగ్ యాప్ ద్వారా పురుషులను ఆకర్షించేలా ఫోటోలు పెట్టి ప్రోఫైల్స్ క్రియేట్ చేసి … పోలీసులు ట్రాక్ చేయకుండా ఉండేందుకు ఈ-వాలెట్ల ద్వారా వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
 
నిందితులు టూరిస్ట్ వీసాపై భారత్ కుచేరుకున్నారని.. వీసాల గడువు ముగియడంతో అక్రమవ్యాపారానికి తెరతీశారని పోలీసులు తెలిపారు. వీరిలో మిల్లీ అనే మహిళ గతేడాది డిసెంబర్‌లో ముంబై చేరుకుంది. 
 
అక్కడనుంచి మార్చిలో హైదరాబాద్ వచ్చింది. టోలి చౌక్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె చికిత్సకూడా తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
 
ఉద్యోగాల పేరుతో ఉగాండ నుంచి మహిళలను రప్పించి ఇక్కడ వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నట్లు చెప్పారు. చైతన్యపురిలో కస్టమర్లకు కలిసేందుకు వచ్చినప్పుడు పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

ప్రేమించడం లేదా అన్నది తన వ్యక్తిగతం : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

తర్వాతి కథనం
Show comments