Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెహ్రూ పార్కులో ఆడ ఏనుగు "గజరాణి" మృతి...

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (15:45 IST)
Elephant
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో అత్యధిక కాలం జీవించిన ఏనుగుగా రికార్డులకెక్కిన ఆడ ఏనుగు "గజరాణి" మృతి చెందింది. 83ఏళ్ల ఈ ఏనుగు వృద్ధాప్య సమస్యలకు తోడు అనారోగ్యంతో బాధపడుతోంది. 
 
ఏసియాటిక్ జాతికి చెందిన ఈ ఏనుగును ఏడవ నిజాం జూపార్కుకి బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. నగరంలో జరిగే మొహర్రం, బోనాల ఊరేంగిపుతో పాటుగా పలు సంప్రదాయ ఉత్సవాలకు ఈ గజరాణినే ఊరేగింపుగా తీసుకెళ్లేవారు. 
 
సాధారణంగా ఏనుగుల జీవిత కాలం 60 ఏళ్లేనని, కానీ ఇది 83 ఏళ్లు జీవించిందని జూ అధికారులు తెలిపారు. 7 జులై 1938లో జన్మించిన ఈ ఏనుగును గతేడాది జులైలో టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్ దత్తత తీసుకున్నారు. వృద్ధాప్య సమస్యలతోనే నిన్న ఇదే జూలో ఓ మగ చిరుత కూడా మృతి చెందింది. దీని వయసు 21 సంవత్సరాలు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments