Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు కోసం కన్నబిడ్డను అమ్ముకున్న తండ్రి.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 30 మే 2023 (16:53 IST)
డబ్బు కోసం కన్నబిడ్డను తండ్రే అమ్మేశాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో జరిగింది. దీనిపై బాలుడి మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
కరీమాబాదా‌కు చెందిన మసూద్ అనే వ్యక్తి నాలుగేళ్ల కుమారుడు అయాన్‌ ఇటీవల ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. పిల్లోడు కనపించక పోవడంతో ఇంట్లోని వారంతా ఆందోళన చెందుతున్నారు. కానీ, పిల్లోడి తండ్రి మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ముఖ్యంగా బిడ్డ కనిపించకపోవడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. భర్త పట్టించుకోకపోవడంతో తన సోదరుడికి చెప్పుకుని ఏడ్చింది. 
 
దీంతో అక్క ఇంటికి వచ్చిన అక్బర్.. తన బావ ప్రవర్తనను అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. మసూద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తన బిడ్డను అమ్మలేదని, పోచమ్మ మైదాన్‌లో ఉంటున్న తమ బంధువులకు పెంచుకునేందుకు ఇచ్చానని వెల్లడించాడు.
 
అయితే, అతని మాటల్లో వాస్తవమెంతో తేల్చేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. బంధువులకు పెంచుకోవడానికి బిడ్డను ఇస్తే, ఇంట్లో వారికి, భార్యకు తెలియకుండా చేయాల్సిన అవసరం ఏమిటని పోలీసులతో పాటు ఫిర్యాదుదారుడు సందేహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: పూరి సేతుపతి టైటిల్, టీజర్ విడుదల తేదీ ప్రకటన

NTR: హైదరాబాద్‌లో కాంతార: చాప్టర్ 1 ప్రీ-రిలీజ్ కు ఎన్టీఆర్

Pawan: హృతిక్, అమీర్ ఖాన్ కన్నా పవన్ కళ్యాణ్ స్టైల్ సెపరేట్ : రవి కె చంద్రన్

OG collections: ఓజీ తో ప్రేక్షకులు రికార్డ్ కలెక్టన్లు ఇచ్చారని దానయ్య ప్రకటన

Avatar: అవతార్: ది వే ఆఫ్ వాటర్ 3Dలో పునఃవిడుదల తెలుపుతూ కొత్త ట్రైలర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments