Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనూషపై కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందిచ్చి రేప్.. 20మందిని రాజేష్ మోసం చేశాడు.. మొత్తం 19 కేసులు?

రెండేళ్ల క్రితం అనూష నాగార్జునసాగర్‌లో పడి అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. తన కుమార్తె జీవితంతో ఆటాడుకున్న గుంటి రాజేష్‌ను అనూష తండ్రి శ్యామసుందర్ రెడ్డి మట్టుబెట్టాడు. రాజేష్‌పై ఇప్పటి

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (18:16 IST)
రెండేళ్ల క్రితం అనూష నాగార్జునసాగర్‌లో పడి అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. తన కుమార్తె జీవితంతో ఆటాడుకున్న గుంటి రాజేష్‌ను అనూష తండ్రి శ్యామసుందర్ రెడ్డి మట్టుబెట్టాడు. రాజేష్‌పై ఇప్పటికీ 19 కేసులున్నాయి. అనూష లాంటి ఎందరో యువతులు ఇతని వద్ద మోసపోయారని తెలిసింది. కిడ్నాప్‌ల నుంచి ల్యాండ్‌ సెటిల్‌మెంట్ల వరకు దందాలు చేసే రాజేష్‌పై.. అప్పటి సైబరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ అతడిపై పీడీయాక్ట్‌ చేశారు. గుంటి రాజేశ్‌ మొత్తం 20 మంది మహిళలను ప్రేమపేరుతో మోసం చేసినట్లు నిర్ధారించారు.
 
అయితే అనూష తండ్రి గతనెల 27న అర్ధరాత్రి ఆదిభట్ల ఠాణా పరిధిలోని తుర్కయాంజల్‌లో గుంటి రాజేశ్‌‌ను హత్య చేశారు. ఓ ప్లాట్ వ్యవహారంలో అనూషకు గుంటి రాజేష్‌తో పరిచయమైంది. ప్లాట్‌ నీదేనని.. అందుకు సంబంధించిన సంతకాలు పెట్టాలని చెప్పి తన ఇంటికి రాజేశ్ అనూషను పిలిపించుకున్నాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెపై అత్యాచారం చేశాడు. దాన్నంతా సెల్‌ఫోన్‌లో బంధించాడు. 
 
తనను పెళ్లిచేసుకోవాలని బెదిరించాడు. గత్యంతరం లేక అతడిని అనూష పెళ్లి చేసుకుంది. తర్వాత అతడికి రెండు పెళ్లిళ్లయ్యాయనే విషయం అనూషకు తెలిసింది. అప్పటి నుంచి అతడిని కలవడం మానేసింది. దీంతో ఆగ్రహించిన రాజేశ్‌ ఆమెను కిడ్నాప్‌ చేశాడు. దీనిపై అనూష తండ్రి శ్యామ్‌సుందర్‌రెడ్డి చైతన్యపురి ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
 
రాజేశ్‌ బారినుంచి తప్పించుకుని అనూష నాగార్జున సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కూతురు జీవితాన్ని నాశనం చేసిన రాజేష్‌ను అనూష తండ్రి హతమార్చాడు. తన కుమార్తెలా ఇంకో యువతి జీవితంతో అతను ఆడుకోడదని అతనని హతమార్చినట్లు శ్యామ్ తెలిపాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments