Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు తెలివితక్కువ.. కొర్విన్ కామెంట్స్.. కౌంటరిచ్చిన గార్షియా

యూరోపియన్ పార్లమెంట్ సమావేశాల్లో పోలాండ్‌కు చెందిన జానుస్ కొర్విన్ మిక్కీ అనే రాజకీయ వేత్త మహిళలపై విద్వేష ప్రసంగం చేశారు. మగవాళ్ల కంటే.. ఆడవాళ్లు తక్కువ సంపాదించాలన్నారు. వారు బలహీనులని చెప్పారు. తెల

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (18:01 IST)
యూరోపియన్ పార్లమెంట్ సమావేశాల్లో పోలాండ్‌కు చెందిన జానుస్ కొర్విన్ మిక్కీ అనే రాజకీయ వేత్త మహిళలపై విద్వేష ప్రసంగం చేశారు. మగవాళ్ల కంటే.. ఆడవాళ్లు తక్కువ సంపాదించాలన్నారు. వారు బలహీనులని చెప్పారు. తెలివి తక్కువని కామెంట్స్ చేశారు. స్త్రీ, పురుషుల మధ్య ఉన్న వేతన వ్యత్యాసంపై చర్చ జరుగుతున్న సమయంలో కొర్విన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఈయన చేసిన వ్యాఖ్యలపై ఓ మహిళా ఎంపీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
 
యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ లో కొర్విన్ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. ఈయన వ్యాఖ్యలపై స్పానిష్ ఎంపీ గార్షియా పెరేజ్ తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. మహిళలు పార్లమెంట్‌కు రావడం మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తోందన్న విషయం అర్థమైందని సెటైర్లు విసిరారు. 
 
యూరోపియన్ మహిళల హక్కుల్ని కాపాడేందుకు తాను సభకు వచ్చానన్నారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని.. కొర్విన్‌పై చర్యలు తీసుకోవాలని గార్షియాతో పాటు పలువురు ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో ప్రెసిడెంట్ పార్లమెంట్ రూల్ ప్రకారం ఎంపీ వ్యాఖ్యలపై విచారణ మొదలైంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments