Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిలాబాద్‌ జిల్లాలో గడువు తీరిన మందులు

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (08:42 IST)
ఆదిలాబాద్‌ రిమ్స్‌లో రోగులకు గడువు తీరిన మందులు, ఇంజక్షన్‌ వేయడంపై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌కు ఆసుపత్రిలో ఎక్స్‌పైర్‌ అయిన మందులు ఇచ్చిన విషయంపై వివరించారు.

దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా రిమ్స్‌ ఆసుపత్రిలో సేవలు మెరుగు పరిచేందుకు డాక్టర్లు, అధికారులు మరింత బాధ్యతగా పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో సొసైటీ మాజీ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడు సాయిచరణ్‌గౌడ్‌ తదితరులున్నారు.
 
కేసు నమోదు చేయాలి..
రిమ్స్‌లో రోగులకు గడువు తీరిన మందులు, ఇంజక్షన్‌ వేయడంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు.

రిమ్స్‌లో ఆదివారం రాత్రి పేషెంట్లకు గడువు తీరిన ఇంజక్షన్లను ఇవ్వడంపైనే కాకుండా రిమ్స్‌లో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేపట్టాలని బీజేపీ నాయకురాలు సుహాసినిరెడ్డి కలెక్టర్‌ను కలిసి కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments