Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి వెళ్తున్నారు.. తల్లిలాంటి పార్టీని వీడాల్సిన పరిస్థితి: కన్నీళ్లు పెట్టుకున్న?

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి బాటలోనే మరికొందరు పార్టీ నేతలు కూడా నడుస్తున్నారు. అయితే టీడీపీని వీడటం ఇష్టం లేకపోయినా.. రేవంత్ రెడ్డి లేకప

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (09:00 IST)
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి బాటలోనే మరికొందరు పార్టీ నేతలు కూడా నడుస్తున్నారు. అయితే టీడీపీని వీడటం ఇష్టం లేకపోయినా.. రేవంత్ రెడ్డి లేకపోవడంతో ఆ పార్టీని వీడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్న కరీంనగర్ జిల్లా మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు భావోద్వేగానికి గురయ్యారు.
 
పెద్దపల్లి నియోజకవర్గ టీడీపీ సమావేశంలో రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలనే నిర్ణయాన్ని ప్రకటించిన విజయ రమణారావు కంటతడిపెట్టారు. కన్నతల్లిలాంటి పార్టీని వీడక తప్పట్లేదని తీవ్ర ఆవేదనకు గురైయ్యారు. పార్టీ సభ్యత్వానికి టి.టీడీపీ జిల్లా అధ్యక్షపదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. వేరేదారిలేక ప్రస్తుతం పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 
 
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు వ్యతిరేకంగా అన్ని వర్గాలు ఏకం‌‌ కావాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా ఉద్యమాలు మొదలవుతున్నాయని.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా అన్ని వర్గాలు ఏకం కావాలన్నారు. రోజుకో మాట పూటకో హామీ ఇస్తూ కాలం వెళ్లదీస్తున్న ముఖ్యమంత్రి మోసాలను ఇంటింటికి తిరిగి చెప్పానని జగ్గారెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments