Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కృషి మరువలేనిది.. రన్‌ ఫర్‌ యూనిటీని ప్రారంభించిన మోదీ

నవభారత నిర్మాణంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కృషి మరవలేనిదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఢిల్లీలో ‘రన్‌ ఫర్‌ యూనిటీ’ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు.

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (08:45 IST)
నవభారత నిర్మాణంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కృషి మరవలేనిదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఢిల్లీలో ‘రన్‌ ఫర్‌ యూనిటీ’ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్య్రానంతరం పటేల్‌ దేశాన్ని ఒక్కటి చేశారని అన్నారు. ఎందరో కుట్రలను చేధించి సామ, దాన, భేద, దండోపాయంతో దేశాన్ని సంఘటితం చేసిన వ్యక్తి పటేల్‌ అని ప్రశంసించారు. 
 
ఇక లౌకికవాదం, భిన్నత్వంలో ఏకత్వం మనదేశానికి ఉన్న ప్రత్యేకతలని మోదీ వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, పటేల్‌ ఆశయాలను వారే ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.  
 
మరోవైపు దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ విగ్రహం వద్ద రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లు నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments