Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలోకి ఈటల రాజేందర్ .. ముహూర్తం ఖరారు

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (19:44 IST)
భారతీయ జనతా పార్టీలోకి తెరాస మాజీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరబోతున్నారు. ఇందుకోసం ఆయన ఈ నెల 14వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. ఈ నెల 14న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ కాషాయం కండువా కప్పుకోనున్నారు. 
 
తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్త‌‍రఫ్‌కు గురైన తర్వాత ఆయన తెరాస ప్రాథమిక సభ్యత్వానికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 
 
ఇప్పటికే ఆయన బీజేపీలో పెద్దలతో చర్చలు జరిపారు. పార్టీ ఆగ్ర నేతల అపాయింట్మెంట్ ఫిక్స్ కావడంతో ఈ నెల 14న ఈటల కాషాయ కండువా కప్పుకోనున్నారు. 
 
భూ కబ్జా ఆరోపణలపై మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఈటల వ్యవహారం రోజుకో మలుపు తిరిగింది. ఈటల సొంతంగా పార్టీ పెడతారని.. లేదంటే బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈటల తన సన్నిహితులతో భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని.. రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈటల బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 
 
మరోవైపు ఈటల ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడంతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 
 
స్పీకర్ పోచారం ఈటల రాజీనామాను ఆమోదం తెలిపితే.. హుజురాబాద్‌లో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఈటలను రాజకీయంగా ఒంటరిని చేయాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఈటల వెంట టీఆర్ఎస్ నాయకులు వెళ్లకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. 
 
ఇప్పటికే మంత్రులు హరీష్‌ రావు, గంగుల కమలాకర్‌లు స్థానిక నాయకులు వరుస భేటీలు అవుతున్నారు. హుజురాబాద్‌లో బీజేపీకి గల బలంపై నాయకులు చర్చిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నోటా కన్నా తక్కువగా 2 వేలలోపు ఓట్లు పోలు కాగా, ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్‌లో బీజేపీ విజయభేరీ మోగించింది. దీంతో బీజేపీని తెరాస తక్కువగా అంచనా వేయడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments