Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రభుత్వ ఎక్సైజ్ షాపుల్లో భారీగా మోసాలు

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (19:36 IST)
ఏపీలో ప్రభుత్వ ఎక్సైజ్ షాపుల్లో భారీగా మోసాలు జరుగుతున్నాయని వార్తలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేశారు ఎక్సైజ్ అధికారులు. చిత్తూరులో ఉన్న 270కి పైగా మద్యం షాపుల్లో అక్రమాలు జరుగుతున్నట్టు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాదిరూపాయలు వైన్ షాపుల్లో గోల్ మాల్ జరుగుతూ వస్తోందని అధికారులు గుర్తించారు.
 
చిత్తూరు జిల్లాల్లో 15 కేసులు వెలుగులోకి వస్తే.. 6 కేసులు మాత్రమె నమోదు చేశారు. ప్రభుత్వ లెక్కల్లో లేకుండా దాదాపు 24 లక్షల రూపాయల మద్యం అమ్మాకాలు జరిగాయని అధికారులు నిర్ధారించారు. గంగాధర నేల్లోరులోని నర్సాపురం మద్యం షాపులో 2.15 లక్షల అక్రమాలు చోటుచేసుకున్నాయి. కాణిపాకం ప్రభుత్వ మద్యం షాపులో 8 లక్షల రూపాయల అక్రమ అమ్మకాలు జరిగాయి.
 
అయితే, ఇప్పుడు జరిగిన సోదాల్లో తేలిన అక్రమాలతో తమకు సంబంధం లేదని ఎక్సైజ్ సిబ్బంది తప్పించుకుంటూ.. తప్పంతా అవుట్ సోర్సింగ్ సిబ్బందిపైకి నెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
 
మరోసారి టీవీ9 అక్రమాలపై తనదైన విధానంలో ప్రభుత్వాన్ని మేలుకొలిపింది. దీంతో నిత్యం ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల్లో జరుగుతున్న అక్రమాల్లో చేతులు మారిపోతున్న కోట్లాదిరూపాయల సొమ్ము విషయం ప్రభుత్వానికి తెలిసివచ్చింది. ఈ అక్రమాలపై ఉక్కుపాదం మోపే అవకాశం చిక్కింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments