Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈటలకు స్వల్ప అస్వస్థత - 'ప్రజా దీవెన యాత్రకు బ్రేక్'

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (18:43 IST)
బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ శుక్రవారం స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఆయన చేపట్టిన ప్రజా దీవెన యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. 
 
ఈ యాత్రలో భాగంగా, ఆయన కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పాదయాత్ర కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తెలిపారు.
 
ఈటెల రాజేందర్ ప్రస్తుతం జ్వరంతో పాటు కాళ్లనొప్పులతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. వీణవంక మండలం కొండపాక వరకు పాదయాత్ర కొనసాగించిన ఆయన శనివారం మధ్యాహ్న భోజనం ముగించిన అనంతరం బాగా నీరసించిపోయారని వెల్లడించారు.
 
కాగా ఈటెలకు వెంటనే వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారని తెలుస్తోంది. కాగా తన భర్త జ్వరం బారిన పడడంతో ఆయన బదులు ఈటెల సతీమణి జమున పాదయాత్రను కొనసాగించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

ప్రేమించడం లేదా అన్నది తన వ్యక్తిగతం : సమంత

Samantha: ఇంకోసారి ప్రేమలో పడి ఆలోచనే సమంతకు లేదా? జెస్సీ రోల్ అంటే చాలా ఇష్టం

నిర్మాతల కష్టాలను హీరోలు పట్టించుకోవడం లేదు : దిల్ రాజు

సందీప్ రెడ్డి వంగా ఆవిష్కరించిన సంతాన ప్రాప్తిరస్తు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

తర్వాతి కథనం
Show comments