Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ బార్డర్‌లో ఎన్‌కౌంటర్ - ఆరుగురు నక్సల్స్ హతం

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (10:05 IST)
తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులకు, నక్సల్స్‌కు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు భారీ ఎన్‌కౌంటర్‌కు దారితీశాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్న చెన్నాపురం సమీపంలోని సుక్మా - బీజాపూర్ జిల్లాల అటవీ ప్రాంతంలో జరిగింది. 
 
ఈ ప్రాంతంలో నక్సల్స్ సంచారం ఉన్నట్టు వచ్చిన సమాచారంతో స్థానిక పోలీసులతో కలిస్ గ్రేహోండ్స్ దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ సమయంలో మావోయిస్టులు కాల్పులు జరపడంతో గ్రేహోండ్స్ దళాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. 
 
కాగా, ఈ మధ్యకాలంలో కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగాయి. దీంతో గ్రేహోండ్స్ దళాలు మావోల కోసం ముమ్మరంగా గాలిస్తూ వచ్చాయి. అలాగే, ప్రత్యేకంగా నిఘా సారించారు. ఈ నేపథ్యంలో తమకు వచ్చిన సమాచారం మేరకు ఈ గాలింపు చర్యలు చేపట్టగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments