తెలంగాణలో సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (07:30 IST)
తెలంగాణలో సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభంకానున్నాయి. విద్యాసంస్థలు తెరవచ్చని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. ప్రత్యక్ష తరగతులు ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్‌ అనుమతిచ్చింది.

అయితే విడతల వారీగా తరగతులను ప్రారంభించే యోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన ప్రారంభించే అవకాశం ఉంది. తరగతిలో 20 మంది పిల్లలకు పైగా ఉంటే రెండు సెక్షన్‌లుగా విభజించాలని భావిస్తున్నారు.

వివిధ రాష్ట్రాల్లో పాఠశాలలు తెరిచేందుకు అమలు చేస్తున్న విధానాలపై కేస్ స్టడీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే స్కూళ్లు తెరిచేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ విద్యాశాఖ సీఎంఓకు ప్ర‌తిపాద‌న‌లు పంపింది.
 
అంతకుముందు పాఠశాలల పునఃప్రారంభంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు.

హాస్టల్‌లో ఉండే విద్యార్థులకు కరోనా పాజిటివ్ వస్తే పరిస్థితి ఏంటి?.. గత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం ఆరా తీసినట్లు తెలుస్తోంది.

థర్డ్ వేవ్ నేపథ్యంలో పిల్లలను తల్లిదండ్రులు స్కూల్స్‌కు పంపిస్తారా? లేదా?.. వివిధ అంశాలపై ఉన్నతాధికారులతో కేసీఆర్ మంతనాలు జరిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments