Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మంత్రికి నకిలీ ఈడీ నోటీసు పంపిన క్రిమినల్స్

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (12:55 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ రెడ్డికి కొందరు క్రిమినల్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) శాఖకు సంబంధించిన నకిలీ నోటీసును పంపించారు. ఇది కలకలం సృష్టించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఉన్నారు. ఈయనకు ఈడీ నోటీసుల పేరుతో నకిలీ లేఖలు వచ్చాయి. అందులో గంగుల సోదరుడిని అరెస్టు చేయనున్నట్టు ఉంది. 
 
ఈ విషయం ఈడీ దృష్టికి రావడంతో ఆ విభాగం అధికారులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ నకిలీ నోటీసుకు సంబంధించి మంత్రి కమలాకర్‌ నుంచి ఫిర్యాదు అందాల్సివుందని తెలిపారు. 
 
మరోవైపు, మంత్రికి నకిలీ నోటీసులు పంపిన దుండగులు.. ఈడీతో మాట్లాడి, సెటిల్‌ చేస్తామంటూ ఓ వ్యక్తితో ఫోన్‌ చేయించడం గమనార్హం. ఇపుడు గుర్తు తెలియని వ్యక్తి ఆ నంబర్‌ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు సైబర్‌క్రైమ్స్‌ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments