Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మంత్రికి నకిలీ ఈడీ నోటీసు పంపిన క్రిమినల్స్

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (12:55 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ రెడ్డికి కొందరు క్రిమినల్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) శాఖకు సంబంధించిన నకిలీ నోటీసును పంపించారు. ఇది కలకలం సృష్టించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఉన్నారు. ఈయనకు ఈడీ నోటీసుల పేరుతో నకిలీ లేఖలు వచ్చాయి. అందులో గంగుల సోదరుడిని అరెస్టు చేయనున్నట్టు ఉంది. 
 
ఈ విషయం ఈడీ దృష్టికి రావడంతో ఆ విభాగం అధికారులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ నకిలీ నోటీసుకు సంబంధించి మంత్రి కమలాకర్‌ నుంచి ఫిర్యాదు అందాల్సివుందని తెలిపారు. 
 
మరోవైపు, మంత్రికి నకిలీ నోటీసులు పంపిన దుండగులు.. ఈడీతో మాట్లాడి, సెటిల్‌ చేస్తామంటూ ఓ వ్యక్తితో ఫోన్‌ చేయించడం గమనార్హం. ఇపుడు గుర్తు తెలియని వ్యక్తి ఆ నంబర్‌ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు సైబర్‌క్రైమ్స్‌ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments