Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇ-మెయిల్ పాస్‌వర్డ్‌లతో జర జాగ్రత్త... రూ.9 కోట్లు మాయం

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (10:53 IST)
ఇమెయిల్‌ల వాడకం, ఆన్‌లైన్ నగదు బదిలీలు సర్వసాధారణమైపోతున్న నేటి తరుణంలో ఇమెయిల్ హ్యాక్‌ల ద్వారా కోట్ల రూపాయలు కొట్టేసిన సంఘటన హైదరాబాద్‌లో బుధవారంనాడు వెలుగు చూసింది.
 
వివరాలలోకి వెళ్తే... హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఇంజినీరింగ్‌ వస్తువులను తయారుచేసే ఓల్టాంపెక్స్‌.. తన ఉత్పత్తులను పశ్చిమ ఆఫ్రికాలోని మాలే దేశానికి చెందిన డైమండ్‌ సిమెంట్‌ సంస్థకు కొంతకాలంగా ఎగుమతి చేస్తోంది. వీటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ ఇరు సంస్థల మధ్య ఆన్‌లైన్‌‌లో జరుగుతూ ఉండేవి. ఈ మేరకు ఓల్టాంపెక్స్‌ సంస్థకు చెందిన ఎస్సార్‌నగర్‌లోని ఓ బ్యాంకు ఖాతాకు ఆఫ్రికా నుంచి నగదు వస్తూండేది.

అయితే.. ఆయా లావాదేవీలపై కన్నేసిన సైబర్‌ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాల వివరాలను తెలుసుకొని... ఓల్టాంప్లెక్స్‌ ఇమెయిల్‌ను హ్యాక్‌ చేసి డైమండ్‌ సిమెంట్స్‌ సంస్థకు అమెరికాకు చెందిన బ్యాంకు వివరాలను పంపారు. బ్యాంకు ఖాతా వివరాలు మారాయనీ... ఇకపై తాము పంపిన కొత్త ఖాతాకు నగదు బదిలీ చేయాలని మెయిల్‌లో పేర్కొన్నారు.

ఆమేరకు డైమండ్‌ సిమెంట్స్‌ 1,259,500 అమెరికన్‌ డాలర్లను(సుమారు రూ.9కోట్లు) కొత్త ఖాతాకు బదిలీ చేసింది. ఇంకా డబ్బు అందలేదని ఓల్టాంప్లెక్స్‌ ఆందోళనతో డైమండ్‌ సిమెంట్స్‌ ప్రతినిధులను ఫోన్‌ ద్వారా సంప్రదించగా అసలు మోసం వెలుగు చూసింది. కేసును  దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments