నేడు దుబ్బాక ఫలితం... 8.30 గంటలకు తొలి రౌండ్‌ ఫలితం

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (07:01 IST)
కౌంట్‌డౌన్‌ స్టార్టయ్యింది.. కోట్లాది మంది ఎదురు చూస్తున్న దుబ్బాక ఫలితానికి ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది..  తెలంగాణ  ఏకైక ఉప ఎన్నిక కావడంతో అంతటా ఆసక్తి నెలకొన్నది. అందరి చూపు ఇటువైపే మళ్లింది. 
 
ఈ నెల 3వ తేదీన పోలింగ్‌ జరుగగా ఈనెల 10న అంటే మంగళవారం అభ్యర్థుల భవితవ్యం బయటపడనుంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందూరు  ఇంజనీరింగ్‌ కళాశాలలో రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది. 
 
తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. అరగంట తర్వాత ఈవీఎంలను ఓపెన్‌ చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు గెలుపోటములపై స్పష్టత ఏర్పడుతుంది. 
 
14 టేబుళ్లు.. 23 రౌండ్లు
కౌంటింగ్‌లో భాగంగా 14 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ టేబుళ్లపై 23 రౌండ్లపాటు ఈవీఎంలను లెక్కిస్తారు. దుబ్బాక నియోజకవర్గంలోని 315 పోలింగ్‌ కేంద్రాల్లో 1,64,192 ఓట్లు పోలయ్యాయి. ఈవీఎంలను ఓపెన్‌ చేయడం, వాటిని లెక్కించడం త్వరత్వరగానే పూర్తవుతాయి.

ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించేలా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా 1,453 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు, 51 సర్వీస్‌ ఓట్లు ఉన్నాయి. వీటిని ముందుగానే లెక్కించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments