Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబ్బాక బైపోల్ : ఓటర్లు ఎవరిపక్షం?... ఎగ్జిట్ ఫలితాలు ఇవే...

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (21:15 IST)
తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి మంగళవారం ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్.రామలింగా రెడ్డి అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరోనా లాక్డౌన్ ఆంక్షలు, నిబంధనల మధ్య పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు హల్చల్ చేస్తున్నాయి. 
 
తాజాగా, థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ సంస్థ దుబ్బాక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించింది. ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్ఎస్‌కే ప్రజలు పట్టం కట్టినట్టు వివరించింది. 51.54 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు తొలిస్థానం లభించినట్టు తెలిపింది. 
 
ఆ తర్వాత బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 33.36 శాతం ఓట్లతో రెండోస్థానంలో, 8.11 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మూడోస్థానంలో ఉన్నట్టు థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ వెల్లడించింది.
 
ఇకపోతే, పొలిటికల్ ల్యాబొరేటరీ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌లో మరో విధమైన ఫలితాలు వచ్చాయి. దుబ్బాకలో బీజేపీదే విజయం అంటూ పొలిటికల్ ల్యాబొరేటరీ పేర్కొంది. బీజేపీకి 47 శాతం ఓట్లు లభించినట్టు తెలిపింది. 38 శాతం ఓట్లతో టీఆర్ఎస్ రెండోస్థానంలో, 13 శాతం ఓట్లతో కాంగ్రెస్ మూడోస్థానంలో నిలిచినట్టు ఆ సంస్థ వెల్లడించింది. 
 
మొత్తంమీద ఈ ఉప ఎన్నికను మూడు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ పోటీ మాత్రం అధికార తెరాస, బీజేపీ పార్టీల మధ్యే కొనసాగింది. ఈ ఇరు పార్టీల నేతలు అకుంఠిత దీక్షతో ఎన్నికల్లో గెలుపు కోసం ముమ్మరంగా కృషి చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments