Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదు, మేడ్చల్ ర్వేస్టేషన్‌లో బోగీలకు మంటలు, అప్రమత్తమైన సిబ్బంది

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (20:53 IST)
హైదరాబాదు నగర శివార్లలోని మేడ్చల్ రైల్వేస్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. రైల్వేస్టేషన్లో ప్రక్కనే నిలిపి ఉంచిన 10 బోగీలలో 2 బోగీలకు మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అగ్నమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు.
 
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి అదుపులోకి తీసుకువచ్చారు. అంతకంటే ముందుగా ఒక బోగీ నుంచి మరో బోగీకి మంటలు వ్యాపించడంతో అక్కడంతా దట్టమైన పొగ అలుముకుంది. రైల్వే స్టేషన్లోనే ఈ ప్రమాదం జరగడం వలన అక్కడ ప్రయీణికులు, స్థానికులు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు.
 
ఈ అగ్ని ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వీ సీహెచ్ రాకేశ్ మాట్లాడుతూ... రెండు బోగీలకు నిప్పంటుకుందని, మంటలను అదుపులోనికి తీసుకొని వచ్చామని తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమైనట్టు తెలిపారు రాకేశ్.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments