Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోటిన్నర బిల్లును మాఫీ చేసిన ఆస్పత్రి... భారత్‌లో కాదు.. మరెక్కడ?

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (08:52 IST)
సాధారణంగా ఇపుడు ఏ ఒక్క ఆస్పత్రికెళ్లినా జేబుకు కన్నం వేస్తారు. రోగి చనిపోయినా సరే శవానికి చికిత్స చేస్తూ బిల్లులు వసూలు చేసే కాలం. ముఖ్యంగా, మన దేశంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చిన్న రోగానికి ఆస్పత్రికెళ్లినా రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. పైగా, అంత డబ్బు చెల్లించేలేం మహాప్రభో అంటూ గగ్గోలు పెట్టినా.. ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కానీ, ఆ ఆస్పత్రి యాజమాన్యం ఏకంగా కోటిన్నర రూపాయల బిల్లును మాఫీ చేసింది. అదీ కూడా ఓ తెలుగు రోగి. ఈ ఘటన దుబాయ్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా పెనుగుముట్లకు చెందిన వడ్నాల రాజేశ్ అనే వ్యక్తి పొట్టకూటికోసం దుబాయ్‌కు వెళ్లాడు. అయితే ఏప్రిల్‌లో రాజేశ్ కు కరోనా సోకింది. దుబాయ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. అయితే అతడికి సుదీర్ఘంగా చికిత్స అందించాల్సి వచ్చింది. 
 
ఈ క్రమంలో బిల్లు కూడా దుబాయ్ పరిస్థితులకు తగినట్టు అతి భారీగా వచ్చింది. 80 రోజుల పాటు చికిత్సకుగాను రూ.1.50 కోట్ల బిల్లు వేశారు. దాంతో కరోనా కంటే ఆ బిల్లే రాజేశ్‌ను భయభ్రాంతులకు గురిచేయగా, ఎన్నారై సంఘాలు అండగా నిలిచాయి.
 
బిల్లు వ్యవహారాన్ని దుబాయ్‌లో భారత కాన్సులేట్‌కు నివేదించాయి. కాన్సులేట్ వర్గాలు రాజేశ్ కరోనా చికిత్స బిల్లు వ్యవహారాన్ని దుబాయ్ ప్రభుత్వానికి వివరించాయి. 
 
దీనిపై పెద్దమనసుతో స్పందించిన దుబాయ్ ప్రభుత్వం రూ.1.50 కోట్ల బిల్లును మాఫీ చేసింది. అంతేకాదు, భారత్ వచ్చేందుకు విమాన ఖర్చులు భరించడంతోపాటు, అదనంగా మరో రూ.10 వేలు ఇచ్చి సహృదయత చాటుకుంది. ఇటీవలే భారత్ చేరుకున్న రాజేశ్ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడికెళ్లినా ఆ దిండుతో పాటు జాన్వీ కపూర్ ప్రయాణం.. ఎందుకు?

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments