Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 ఏళ్ల మహిళా రోగి పొట్ట నుంచి 12 కిలోల కాలేయం తొలగింపు

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (20:12 IST)
భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో 50 ఏళ్ల మహిళ రోగికి వైద్యులు 12 కిలోల బరువున్న కాలేయాన్ని తొలగించి మూత్రపిండాల మార్పిడి చేశారు.
 
ముగ్గురు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌లు, కిడ్నీ మార్పిడి సర్జన్‌తో సహా పేరెన్నికగన్న సర్జన్ల బృందం ఏకకాలంలో కాలేయం, మూత్రపిండాల మార్పిడిని నిర్వహించింది. నవంబర్ మొదటి వారంలో శస్త్రచికిత్స చేసినట్లు ఆసుపత్రి గురువారం ప్రకటించింది.
 
పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చెందిన ఉషా అగర్వాల్ అనే మహిళను వైద్యులు కాపాడారు. ఆ మహిళ కాలేయం చాలా పెద్దదిగా వుండటంతో అది ప్రేగులను స్థానభ్రంశం చేస్తూ ఆమె పొత్తికడుపు మొత్తాన్ని ఆక్రమించింది. 
 
సాధారణ ఆరోగ్యకరమైన పరిస్థితులలో, కాలేయం గరిష్టంగా 1.5 కిలోల బరువు ఉంటుంది. కానీ ఆమె కాలేయం భారీ సైజులో వుండటంతో ఆమె నానా తంటాలు పడింది. దీంతో ఆమె కాలేయాన్ని, కిడ్నీని ఒకేసారి మార్పిడి చేసినట్లు వైద్యులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments