Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ

Webdunia
గురువారం, 12 మార్చి 2020 (06:42 IST)
పేద ప్రజలు వైద్యంపై చేసే ఖర్చును తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటల రాజేందర్​ శాసనమండలిలో అన్నారు. కంటివెలుగు పథకం ద్వారా 40 లక్షల మందికి కళ్ల అద్దాలు పంపిణీ చేశామని మంత్రి స్పష్టం చేశారు.

కంటి వెలుగు పథకం ద్వారా 40 లక్షల మందికి కళ్ల అద్దాలు పంపిణీ చేశామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శాసనమండలిలో ​తెలిపారు. ఇవాళ మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే అన్ని రకాల చికిత్సలు జరగాలనేది తమ సిద్ధాంతమని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 40 ఆస్పత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో ఆస్పత్రిలో దాదాపు 5 డయాలసిస్‌ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేదలు వైద్యంపై చేసే ఖర్చును తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అంగన్‌వాడీల ద్వారా పిల్లలకు పోషకాహారం అందిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్​ మండలిలో స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments