Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కొడుకు ముఖం చూపించి చంపేసి వుంటే సంతోషపడేవాడిని: 'దిశ' నిందితుడు తండ్రి

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (19:12 IST)
దిశపై అత్యాచారం, ఆపై హత్యపై దేశంలో ఆగ్రహావేశాలు పెల్లుబుకిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు దిశ నిందితులను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత రిమాండ్, ఆ తర్వాత కస్టడీలోకి తీసుకుని ఘటనా స్థలంలో విచారణ చేస్తున్న సమయంలో నిందితులు తిరగబటంతో ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా మిఠాయిలు పంచుకుని బాణాసంచా కాల్చారు. 
 
మరి నిందితుల కుటుంబ సభ్యులు మాటేంటి? వాళ్లేమన్నారు అనేది చూస్తే, దిశ హత్య కేసులో నలుగురు నిందితుల్లో జొల్లు శివ అనే నిందితుడు తండ్రి ఎన్ కౌంటర్ పైన వ్యాఖ్యానించారు. తన కొడుకుని చంపేయడంపై తనకు అభ్యంతరం లేదనీ, అలాగే ఉరి తీసినా తనేమీ బాధపడనని కేసు గురించి తెలిసినప్పుడే చెప్పానన్నారు. 
 
ఐతే తన కుమారుడు శివ ముఖాన్ని ఒక్కసారి చూపించి, అతడితో నాలుగు ముక్కలు మాట్లాడే అవకాశం తనకు కల్పిస్తే సంతోషపడేవాడనని అన్నారు. అతడి ముఖం చూసిన తర్వాత పోలీసులు చంపేసి వుంటే ఆనందపడేవాడినని వెల్లడించారు. తన కుమారుడిని పోలీసులు కావాలనే ఎన్‌కౌంటర్ చేసి చంపేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments