డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. వారిద్దరి వేధింపులే కారణమా?

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (18:24 IST)
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. వేధింపులు తాళలేక ఓ డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్‌లో జరిగింది. హర్కాపూర్‌ గ్రామానికి చెందిన రాథోడ్ శ్రీదేవి (21) డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగి అనుమానాస్పదంగా బలవన్మరణానికి పాల్పడింది. 
 
అయితే.. తన సోదరి మృతికి తన భార్య, అత్త వేధింపులే కారణమని మృతురాలి అన్న ఇంద్రవెల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పలు వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
 
అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇంద్రవెల్లి పోలీసులు పేర్కొన్నారు. అయితే.. అతని భార్య, అత్త వేధింపుల కారణంగానే యువతి ఆత్మహత్యకు పాల్పడిందా… లేదా మరేదైనా కారణం ఉందా.? అన్న కోణంలో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag: లెనిన్ ప్రమోషన్ల హడావిడి మధ్యలో సరదా క్షణాలతో అక్కినేని నాగార్జున

Samudra: ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు - ఎఫ్.డి.సి డైరెక్టర్ సముద్ర

Allari Naresh : ఆల్కహాల్ తో అల్లరి నరేష్ పుట్టినరోజు జరుపుకుంటే రంభ ఊర్వశి మేనక వచ్చారు

Adivi Sesh : జూలైలో జి 2 షెడ్యూల్ చాలా ప్రత్యేకమైందంటున్న అడివి శేష్

అవకాశాలు లేక వెనుకబడిన హీరోయిన్... అయినా పవన్ చిత్రంలో గోల్డెన్ ఛాన్?

తర్వాతి కథనం
Show comments