రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ వేయడమే కాదు జైలుశిక్ష కూడా?

Webdunia
బుధవారం, 7 జులై 2021 (09:53 IST)
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు హెచ్చరికలు పంపారు. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. ఉల్లంఘనుల తాట తియ్యనున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ వేయడమే కాదు జైలుశిక్ష కూడా విధించనున్నారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించనున్నారు.
 
యాక్సిడెంట్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఇతర ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కేసులో డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అయినా, రద్దైనా లెక్క చేయకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులకు పోలీసులు షాక్ ఇవ్వనున్నారు. వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టు వారికి రూ.10వేల జరిమానా, 3 నెలల జైలుశిక్ష విధించనుంది. వీరి కోసం త్వరలోనే సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
 
"ఇకపై డ్రైవింగ్‌ లైసెన్స్‌ తాత్కాలికంగా సస్పెండైన వారు లేదా రద్దయిన వారు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. గత మూడేళ్లలో రోడ్డు ప్రమాదాలు చేసిన వారు, డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో పదే పదే పోలీసులకు దొరికిన వారు, ఇష్టానుసారంగా, నిబంధనలు తుంగలో తొక్కి వాహనాలు నడిపిన వారి లైసెన్స్‌లు రద్దు చేయాలని ఆర్టీఏ అధికారులకు వందల సంఖ్యలో లేఖలు రాశాము"అని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments