Webdunia - Bharat's app for daily news and videos

Install App

మర్కజ్ మీట్‌కెళ్లి అంటించుకున్నాడు.. ఇంటికొచ్చి 46 మందికి అంటించాడు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (10:45 IST)
హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి మర్కజ్ మత సమ్మేళనానికి వెళ్లి కరోనా వైరస్ బారినపడ్డాడు. అతను ఇంటికొచ్చి, ఆ కుటుంబంలోని 46 మందికి ఈ వైరస్ అంటించాడు. దాంతో ఆ కుటుంబ సభ్యులందరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని నారాయడగూడలో తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంటే తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో నమోదవుతున్న కేసులన్నీ ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌ మీట ద్వారా సంక్రమించినట్టు తేలింది. అందుకే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నట్టు ఓ నిర్ధారణకు వచ్చారు. 
 
తాజాగా నారాయణగూడ పార్ధాగేట్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు ఈ మర్కజ్ సమ్మేళనానికి వెళ్లారు. వారిని గుర్తించి కరోనా పరీక్షలు చేయగా, వారిలో ఒకరికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. మిగిలిన ఐదుగురి పరీక్షా ఫలితాలు రావాల్సివుంది. 
 
అయితే, ఈ కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన వ్యక్తి కుటుంబంలోని 46 మందితో సన్నిహితంగా మెలిగాడు. దీంతో ఆ 46 మంది కుటుంబ సభ్యులను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అంతేకాకుండా, ఈ 46 మంది ఎవరినైనా కలిశారా లేదా అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments