Webdunia - Bharat's app for daily news and videos

Install App

మర్కజ్ మీట్‌కెళ్లి అంటించుకున్నాడు.. ఇంటికొచ్చి 46 మందికి అంటించాడు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (10:45 IST)
హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి మర్కజ్ మత సమ్మేళనానికి వెళ్లి కరోనా వైరస్ బారినపడ్డాడు. అతను ఇంటికొచ్చి, ఆ కుటుంబంలోని 46 మందికి ఈ వైరస్ అంటించాడు. దాంతో ఆ కుటుంబ సభ్యులందరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని నారాయడగూడలో తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంటే తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో నమోదవుతున్న కేసులన్నీ ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌ మీట ద్వారా సంక్రమించినట్టు తేలింది. అందుకే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నట్టు ఓ నిర్ధారణకు వచ్చారు. 
 
తాజాగా నారాయణగూడ పార్ధాగేట్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు ఈ మర్కజ్ సమ్మేళనానికి వెళ్లారు. వారిని గుర్తించి కరోనా పరీక్షలు చేయగా, వారిలో ఒకరికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. మిగిలిన ఐదుగురి పరీక్షా ఫలితాలు రావాల్సివుంది. 
 
అయితే, ఈ కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన వ్యక్తి కుటుంబంలోని 46 మందితో సన్నిహితంగా మెలిగాడు. దీంతో ఆ 46 మంది కుటుంబ సభ్యులను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అంతేకాకుండా, ఈ 46 మంది ఎవరినైనా కలిశారా లేదా అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments