కరోనావైరస్... పెద్దమ్మ తల్లి గుడిలో కొత్త ప్రయోగం

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2020 (20:51 IST)
జూబ్లీహిల్స్‌లో కొలువైన పెద్దమ్మ తల్లి ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక శని, ఆదివారాలు అయితే భక్తుల రద్దీ ఇక చెప్పనక్కరలేదు. అయితే శ్రావణ మాసం మూలంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున వరుస కడుతున్నారు. 
 
అయితే కరోనావైరస్ మూలంగా భక్తుల దర్శనానికి ఇబ్బంది లేకుండా భౌతిక దూరం పాటించేలా 
సర్కిల్స్ వేసి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే ఎంతచెప్పినా కూడా భక్తులు నిబంధనలు పట్టించుకోకపోవడంతో కొత్త ప్రయోగం చేపట్టారు ఆలయ నిర్వాహకులు.
 
భక్తులు సామాజికదూరం పాటించేలా గొడుగులు ఏర్పాటు చేశారు. లోపలికి వచ్చిన భక్తులకు ఒక్కొక్కరికి ఒక్కో గొడుగు ఇస్తున్నారు. దర్శనం పూర్తయ్యే వరకు భక్తులు గొడుగు పట్టుకునే ఉండాలి. అమ్మవారు దర్శనం పూర్తయ్యాక  బయటకు వచ్చిన తరువాత మాత్రమే ఆ గొడుగు ఆలయ సిబ్బందికి తిరిగి ఇవ్వాలి.

ఈ గొడుగులు ప్రయోగం చాలా బాగుందని, దీనివల్ల లోపలికి వచ్చిన భక్తులు కచ్చితంగా భౌతికదూరం పాటిస్తున్నారు అని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Rashmika : విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం.. ఫిబ్రవరి 26న సీక్రెట్ మ్యారేజ్?

Shruti Haasan: ఆకాశంలో ఒక తార లో సిగరెట్‌ తాగుతూ రఫ్‌ గా వుండే పాత్రలో శృతి హాసన్‌

Lakshmi Rai: లక్ష్మీ రాయ్ జనతా బార్.. త్వరలోనే హిందీ లో విడుదల

మొదటి సారిగా మనిషి మీద నమ్మకంతో శబార మూవీని చేశా : దీక్షిత్ శెట్టి

Yadu Vamsi: తెలుగమ్మాయి కోసం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సన్నాహాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ

వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?

సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్

వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments