కరోనావైరస్... పెద్దమ్మ తల్లి గుడిలో కొత్త ప్రయోగం

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2020 (20:51 IST)
జూబ్లీహిల్స్‌లో కొలువైన పెద్దమ్మ తల్లి ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక శని, ఆదివారాలు అయితే భక్తుల రద్దీ ఇక చెప్పనక్కరలేదు. అయితే శ్రావణ మాసం మూలంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున వరుస కడుతున్నారు. 
 
అయితే కరోనావైరస్ మూలంగా భక్తుల దర్శనానికి ఇబ్బంది లేకుండా భౌతిక దూరం పాటించేలా 
సర్కిల్స్ వేసి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే ఎంతచెప్పినా కూడా భక్తులు నిబంధనలు పట్టించుకోకపోవడంతో కొత్త ప్రయోగం చేపట్టారు ఆలయ నిర్వాహకులు.
 
భక్తులు సామాజికదూరం పాటించేలా గొడుగులు ఏర్పాటు చేశారు. లోపలికి వచ్చిన భక్తులకు ఒక్కొక్కరికి ఒక్కో గొడుగు ఇస్తున్నారు. దర్శనం పూర్తయ్యే వరకు భక్తులు గొడుగు పట్టుకునే ఉండాలి. అమ్మవారు దర్శనం పూర్తయ్యాక  బయటకు వచ్చిన తరువాత మాత్రమే ఆ గొడుగు ఆలయ సిబ్బందికి తిరిగి ఇవ్వాలి.

ఈ గొడుగులు ప్రయోగం చాలా బాగుందని, దీనివల్ల లోపలికి వచ్చిన భక్తులు కచ్చితంగా భౌతికదూరం పాటిస్తున్నారు అని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: బ్యాండ్ ఆర్టిస్ట్ కి గౌరవం తెచ్చేలా దేత్తడి ఉంటుంది : దిల్ రాజు

Sanjay Dutt: సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ

'పంజుర్లి' హావభావాలు ప్రదర్శించి చిక్కుల్లో పడిన 'ధురంధర్' హీరో

Hrithik Roshan: ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కోసం హృతిక్ రోషన్, ర్యాన్ గాస్లింగ్ ప్రత్యేక సంభాషణ

Anandhi: గరివిడి లక్ష్మి లో కోసింది కొయగూర సాంగ్ లో ఆకట్టుకున్న ఆనంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెన్ను నొప్పి పారదోలే చిట్కాలు

వన్‌చెఫ్‌ను విడుదల చేసిన ఫిలిప్స్

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

తర్వాతి కథనం
Show comments