Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కల్లోలం: తెలంగాణలో లాక్‌డౌన్ విధించం, కర్ఫ్యూ కూడా వుండదు: ఈటెల రాజేందర్

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (18:21 IST)
రాష్ట్రంలో లాక్డౌన్ లేదా కర్ఫ్యూ విధించే అవకాశం లేదని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ... "ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు రక్షణ చర్యలను పాటించాలి. మాస్కు వేసుకోవాలి, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి" అని మంత్రి శుక్రవారం హుజురాబాద్ పర్యటనలో అన్నారు.
 
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని ఆయన ప్రజలకు సూచించారు. చికిత్స కోసం ప్రజల నుండి అధిక ధరలు వసూలు చేయవద్దని ఈటెల ప్రైవేట్ ఆసుపత్రులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొంత మానవత్వాన్ని చూపించమని కోరారు.
 
ధాన్య సేకరణ కేంద్రాలకు రైతులు వెళ్లేటప్పుడు ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ మరింత తీవ్రతరం అవుతున్నందున, మాస్కు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన కోరారు. కాగా తెలంగాణలో రోజువారీ కేసులు 3 వేలు దాటుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు సైతం కరోన బారిన పడుతున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments