Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కల్లోలం: తెలంగాణలో లాక్‌డౌన్ విధించం, కర్ఫ్యూ కూడా వుండదు: ఈటెల రాజేందర్

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (18:21 IST)
రాష్ట్రంలో లాక్డౌన్ లేదా కర్ఫ్యూ విధించే అవకాశం లేదని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ... "ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు రక్షణ చర్యలను పాటించాలి. మాస్కు వేసుకోవాలి, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి" అని మంత్రి శుక్రవారం హుజురాబాద్ పర్యటనలో అన్నారు.
 
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని ఆయన ప్రజలకు సూచించారు. చికిత్స కోసం ప్రజల నుండి అధిక ధరలు వసూలు చేయవద్దని ఈటెల ప్రైవేట్ ఆసుపత్రులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొంత మానవత్వాన్ని చూపించమని కోరారు.
 
ధాన్య సేకరణ కేంద్రాలకు రైతులు వెళ్లేటప్పుడు ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ మరింత తీవ్రతరం అవుతున్నందున, మాస్కు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన కోరారు. కాగా తెలంగాణలో రోజువారీ కేసులు 3 వేలు దాటుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు సైతం కరోన బారిన పడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

Siddu: కన్యా కుమారి ట్రైలర్ లో హిట్ వైబ్ కనిపించింది : సిద్దు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments