పేద ప్రజలకు కాంగ్రెస్ అండగా : ఎమ్మెల్యే సీతక్క

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (18:09 IST)
కరోనా వైరస్ కు ఇప్పటి వరకు ఎలాంటి మందు లేదని..నివారణ ఒక్కటే మార్గమని ప్రజలకు చెబుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. తాడ్వాయి మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ…కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.

కాంగ్రెస్ కార్యకర్తల సహకారంతో ఆయా గ్రామాల పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించారు. ఎవరికీ ఇబ్బందుల్లేకుండా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
 
ఈ సందర్భంగా కరోనాను అరికట్టేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు ఎమ్మెల్యే సీతక్క. కరోనా వైరస్ అంటువ్యాధి అని ఒకరి నుండి ఒకరికి అత్యంత తొందరగా చేరుకుంటుందని చెప్పారు.

దీన్ని కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరు స్వీయ గృహ నిర్బంధాన్ని పాటించి ఇంట్లో నుండి బయటికి రాకుండా ఉండాలన్నారు.

ఒకవేళ అత్యవసర పరిస్థితిలో బయటికి వెళ్లాల్సి వచ్చినా ముఖానికి మాస్క్  పెట్టుకోవాలన్నారు . అలాగే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత శానిటైజర్ తోగానీ… సబ్బులతో చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు సీతక్క.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

Ajay Bhupathi: తిరుపతిలో శ్రీనివాస మంగాపురం మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

Manchu Manoj :డేవిడ్ రెడ్డి లో హీరోయిన్ గా మారియా ర్యాబోషాప్కా

Ranveer Singh: ధురంధర్ ది రివెంజ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్

సింగపూర్‌కు చేరుకున్న డిస్నీ అడ్వెంచర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం