Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం ఆంధ్రోళ్లమా.. తెలంగాణ అసెంబ్లీలో కడిగేసిన లేడీ టైగర్..!?

తెలంగాణ అసెంబ్లీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై వాడి వేడి చర్చ జరిగింది. ఇటీవల తెలంగాణ సీఎం తన ఫామ్ హౌస్ సమీపంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అట్టహాసంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోని గ్రామస్తులు గృహ

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (11:40 IST)
తెలంగాణ అసెంబ్లీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై వాడి వేడి చర్చ జరిగింది. ఇటీవల తెలంగాణ సీఎం తన ఫామ్ హౌస్ సమీపంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అట్టహాసంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోని గ్రామస్తులు గృహ ప్రవేశం చేసిన సంగతి మీడియా అంతా ధూంధాంగా చూపించారు. ఆ గ్రామస్తులు ఏకంగా కేసీఆర్ ఫోటోనే దేవుడి ఫోటోగా ఇళ్లలో పెట్టుకున్నారు. ఇక మీడియాలో ఈ గృహ ప్రవేశం కార్యక్రమం బ్రహ్మాండంగా హైలెట్ అయ్యింది.  
 
కానీ.. రాష్ట్రంలో కొన్ని లక్షల పేదలు ఉండగా.. కేవలం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లోనే పేదలు ఉన్నట్టు.. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించగానే పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించినట్టు మీడియాలో ఫోకస్ కావడమే దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అసెంబ్లీలో నిలదీసింది. 
 
కేసీఆర్ నియోజకవర్గంలో, హరీశ్ రావు నియోజకవర్గాల్లో ఇళ్లుకడితే సరిపోయిందా అంటూ నిలదీసింది. మేం మీలాగే ప్రజలతో ఎన్నుకోబడలేదా.. మేం ఎమ్మెల్యేలం కామా.. మేమేమైనా ఆంధ్రోళ్లమా.. మా పల్లెల్లో డబుల్ బెడ్రూము ఇళ్లు వద్దా అంటూ డీకే అరుణ ప్రశ్నించింది.  

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments