Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం..! ప్రతిపక్ష హోదా కూడా అంతమైంది!

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (13:05 IST)
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు తెలంగాణలో మరో షాక్ తగిలింది. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా స్థాయిని కోల్పోయింది. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిన కాంగ్రెస్‌కు 18 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. 
 
అయితే గెలుపొందిన ఆ 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 12 మంది తెరాసలోకి ఫిరాయించి ఆ పార్టీ శాసనసభా పక్షంలో విలీనం చేస్తున్నట్లు స్పీకర్‌ను కోరడంతో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష స్థాయి కూడా దక్కకుండా పోయింది. 
 
అంతేకాకుండా సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విపక్ష నేత హోదాను కోల్పోయారు. ఫలితంగా తెలంగాణ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా పోయింది. ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎం ఇప్పుడు అతి పెద్ద పార్టీ అయింది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ వి. నరసింహాచార్యులు బుధవారం నాడు ఓ బులెటిన్ జారీ చేసారు.
 
ఆయన ఇదే విషయమై మల్లు భట్టివిక్రమార్కకు లేఖ రాసారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు సభలో మీ పార్టీ బలం ఆరుకు తగ్గిపోయిందని, ఫలితంగా మీ పార్టీ విపక్ష హోదా కోల్పోయిందని తెలిపారు. 
 
ఈ ఆదేశాలు ఈనెల 6 నుంచే అమల్లోకి వచ్చినట్లు భావించాలని కోరారు. ఇదిలా ఉంటే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో శాసనసభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఐదుకు తగ్గనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments