టీచర్ దంపతుల పిల్లలను దత్తత తీసుకున్న జానారెడ్డి తనయుడు!

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (12:34 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక మంది ఉపాధిని కోల్పోయారు. ముఖ్యంగా, ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులు, దినకూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ముఖ్యంగా, ప్రైవేటు స్కూల్స్‌లో పని చేసే బండిపంతుళ్ళ పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఎలాంటి ఉపాధి దొరకపోవడంతో కుటుంబపోషణ భారమైపోయింది. 
 
దీంతో అనేక మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన ప్రైవేట్ టీచర్ వెన్నం రవి, ఆయన భార్య సూసైడ్ చేసుకొని రెండు రోజుల క్రితం చనిపోయారు. దాంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. 
 
మృతుడు రవి కుటుంబాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సాగర్ అభ్యర్థి జానారెడ్డి కొడుకు రఘువీర్ పరామర్శించాడు. రవి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి.. పిల్లలను దత్తత తీసుకుంటానని వారికి భరోసా ఇచ్చారు. 
 
అంతేకాకుండా.. పిల్లల చదువులు, ఇతర ఖర్చులన్నీ తానే చూసుకుంటానని రఘువీర్ హామీ ఇచ్చాడు. సాగర్‌లో ఉపఎన్నిక దగ్గరపడుతున్న సమయంలో.. జానారెడ్డి కొడుకు రఘువీర్.. మృతుడు రవి కుటుంబాన్ని పరామర్శించడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments