Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ .. నేడు యాదాద్రికి - 11న జనగామకు

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (08:45 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరిసింహా స్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి 11 గంటలకు బయలుదేరే సీఎం కేసీఆర్ యాదాద్రి కొండపైకి చేరుకుని ఆలయ ఉద్ఘాటనకు సంబంధించిన పనులను పరిశీలిస్తారు. 
 
అలాగే, మహాకుంభ సంప్రోక్షణ, మహాసుదర్శన యాగం నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరుపుతారని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. కాగా, గత 2014లో సీఎం హోదాలో తొలిసారి యాదాద్రికి వచ్చిన కేసీఆర్.. ఇప్పటివరకు 15 సార్లు ఈ పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్లారు. 
 
మరోవైపు, ఈ నెల 11వ తేదీన జనగామ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన సందర్భంగా జిల్లా పార్టీ నేతలు ఏర్పాటు భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఇందుకోసం బహిరంగ సభ స్థలాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్‌, స్థానిక జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments