గోదారమ్మ విలయతాండవం.. ఏరియల్ సర్వే చేయనున్న సీఎం కేసీఆర్

Webdunia
శనివారం, 16 జులై 2022 (12:28 IST)
నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ కారణంగా అనేక జిల్లాలు వరద ముంపునకు గురయ్యారు. అనేక గ్రామాలు నీట ముగినిపోయాయి. ఈ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే చేయనున్నారు. 
 
భారీ వర్షాల కారణంగా నెలకొన్న వరద నష్టం, గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదపై సమీక్షించనున్నారు. కడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌తో కలిసి సీఎం ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. 
 
ఏరియల్ సర్వేకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ సహా భద్రతా పరమైన అంశాలను అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. 
 
సీఎం ఆదేశాల మేరకు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని దవాఖానాలకు చెందిన వైద్యులు, ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. రేపు సీఎం ఏరియల్‌ సర్వే నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కార్యాచరణపై వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments