Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదారమ్మ విలయతాండవం.. ఏరియల్ సర్వే చేయనున్న సీఎం కేసీఆర్

Webdunia
శనివారం, 16 జులై 2022 (12:28 IST)
నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ కారణంగా అనేక జిల్లాలు వరద ముంపునకు గురయ్యారు. అనేక గ్రామాలు నీట ముగినిపోయాయి. ఈ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే చేయనున్నారు. 
 
భారీ వర్షాల కారణంగా నెలకొన్న వరద నష్టం, గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదపై సమీక్షించనున్నారు. కడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌తో కలిసి సీఎం ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. 
 
ఏరియల్ సర్వేకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ సహా భద్రతా పరమైన అంశాలను అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. 
 
సీఎం ఆదేశాల మేరకు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని దవాఖానాలకు చెందిన వైద్యులు, ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. రేపు సీఎం ఏరియల్‌ సర్వే నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కార్యాచరణపై వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments