Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ కోలుకోవాలంటూ వారణాసిలో ఫ్లెక్సీలు

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (10:06 IST)
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రికి తరలించి వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేశారు. ఇలాంటి పరీక్షల్లో కరోనరీ యాంజియోగ్రామ్ కూడా ఉంది. 
 
అయితే, కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారన్న వార్త, ఆయన్ను ఆస్పత్రిలో స్టెచ్చర్‌లో పడుకోబెట్టి వైద్యులు తీసుకెళుతున్న దృశ్యాలకు సంబంధించిన పోటీలు సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టాయి. దీంతో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 
 
ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణాకు చెందిన సాయి అనే వీరాభిమాని ఈ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. శుక్రవారం సాయంత్రం గంగానదిలో దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించి నదిలోని బోట్లలో కేసీఆర్ ఫ్లెక్సీలను కట్టినట్టు చెప్పారు. 
 
ఫ్లెక్సీలపై దేశ్ కా నేత అంటూ పెద్ద అక్షరాలతో రాసి కేసీఆర్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత ఫోటోలను కూడా ముద్రించారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌కు కాశీ విశ్వనాథుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అగ్ర నిర్మాతలు - చిన్న నిర్మాతలు అలక

కళ్యాణ్ రామ్‌ యాక్షన్‌ చిత్రంలో విజయశాంతి

కాశ్మీర్ వ్యాలీలో మిస్టర్ బచ్చన్ కోసం మెలోడీ డ్యూయెట్ సాంగ్ షూట్

సుమ‌న్‌తేజ్, హెబ్బాప‌టేల్ న‌టించిన సందేహం మూవీ రివ్యూ

భారతీయ చిత్రపరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments