Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం సతీమణి శోభకు అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
ఆదివారం, 12 మార్చి 2023 (16:16 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖ రావు సతీమణి శోభ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆమెను గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆమెకు కొన్ని వైద్యు పరీక్షల తర్వాత చికిత్స అందిస్తున్నారు. దీంతో మంత్రులు కేటీఆర్, మంత్రి హరీశ్ రావులు ఆస్పత్రిలోనే ఉన్నారు. తన భార్య శోభతో పాటు సీఎం కేసీఆర్ కూడా అస్వస్థతకు లోనయ్యారు. దీంతో కేసీఆర్‌కు కూడా వైద్య పరీక్షలు చేస్తున్నారు. అయితే, వీరిద్దరి వైద్య పరీక్షలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
 
మరోవైపు, తన తల్లి అస్వస్థతకు లోనయ్యారన్న వార్తను తెలుసుకున్న ఎమ్మెల్సీ కె.కవిత హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని, ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బంజారాహిల్స్‌లోని తన నివాసానికి ఆమె చేరుకున్నారు. మరోవైపు, శోభ ఆరోగ్యం నిలకడగానే వుంది. అయినప్పటికీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు ఆస్పత్రిలోనే ఉన్నారు. 
 
ఇదిలావుంటే, సీఎం కేసీఆర్‌తో కవిత సమావేశమయ్యారు. ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు కూడా పాల్గొన్నారు. ఇందులో ఢిల్లీ మద్యం స్కామ్‌లో ఈడీ అధికారులు కవితను విచారించారు. ఈ విచారణలో ఏం జరిగిందనే దానిపై వారు చర్చించినట్టు సమాచారం. అలాగే, ఈ నెల 16వ తేదీన కవితను మరోమారు విచారణకు రావాలని ఈడీ కోరింది. ఇంతలోనే శోభ అస్వస్థతకు లోనుకావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments