జైలులోని ఖైదీల భార్యలపై కన్నేసిన జైలు ఉన్నతాధికారి!

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (13:34 IST)
హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి జైలులో ఉన్న ఖైదీల భార్యలపై ఆ జైలులో పని చేసే ఉన్నతాధికారి ఒకరు కన్నేశారు. వారు తమ భర్తలను కలిసేందుకు వచ్చినపుడు వారితో మాటలు కలిపి... తన గదికి రావాలంటూ కోరేవాడు. ఈ విషయంపై పలువురు ఖైదీల భార్యలు జైళ్ళ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరా తీసిని ఉన్నతాధికారులు ఈ ఆరోపణలు నిజమని తేలడంతో కామాంధ అధికారిని వ్యవసాయ క్షేత్రానికి బదిలీ చేశారు. 
 
వివిధ నేరాలకు పాల్పడి జైలుపాలైన ఖైదీలను వారి కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు జైలు అధికారులు ములాఖత్ నిర్వహిస్తుంటారు. నిర్ధేశిత సమయంలో ఖైదీలతో వారి కుటుంబ సభ్యులు మాట్లాడేందుకు అనుమతిస్తుంటారు. అయితే, చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథ్ ఆ ఖైదీల భార్యలపై కన్నేసి వారిని వేధించసాగాడు. దీంతో అనేక బాధితులు జైళ్ళ శాఖకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ వ్యవహారంపై జైళ్ళశాఖ డైరెక్టర్ జనరల్ జితేందర్ విచారణకు ఆదేశించారు. దీంతో చింతల దశరథ్‌ను జైలు శాఖ ఆధీనంలోని వ్యవసాయ క్షేత్రానికి బదిలీ చేశారు. ఈయన గతంలో కూడా జైలులో పని చేసే మహిళా సిబ్బందిపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు నమోదైవుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం