Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యాసింజర్ సెస్ పేరుతో ప్రయాణికులపై భారం మోపిన టీఎస్ ఆర్టీసీ

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (11:04 IST)
ప్రయాణికులపై ఉన్నట్టుండి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం చార్జీల భారం మోపింది. ఇటీవలే చిల్లర సమస్యను పరిష్కరించేందుకు వీలుగా రౌండప్ పేరిట చార్జీలను పెంచింది. ఇపుడు మరోమారు భారీగా వడ్డించింది. 
 
ప్యాసింజర్ సెస్ పేరిట ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 పెంచుతున్నట్టు ప్రకటించింది. అలాగే, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 వరకు చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆకస్మిక నిర్ణయంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు, ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు మరింతగా చేరువ చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుని అనేక రకాలైన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులపై మరోమారు ప్రయాణ చార్జీలు మోపడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments