Webdunia - Bharat's app for daily news and videos

Install App

గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ - సీఈసీ లేఖ

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (14:50 IST)
గత ఎన్నికల్లో గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీకే అరుణ ఎమ్మెల్యేగా గెలిచినట్టుగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసింది. గద్వాల నుంచి డీకే అరుణ గెలిచినట్టు ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెల్సిందే. ఈ తీర్పు నేపథ్యంలో డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సకంఘాన్ని ఆదేశిస్తూ లేఖ రాసింది.
 
గత ఎన్నికల్లో గద్వాల నుంచి తెరాస తరపున కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. డీకే అరుణ రెండో స్థానంలో నిలించారు. అయితే, నామినేషన్ దాఖలు సమయంలో కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు వివరాలు సమర్పించారు.  దీంతో తెలంగాణ హైకోర్టు కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు శిక్షగా రూ.2.50 లక్షల అపరాధం కూడా విధించింది. 
 
అలాగే, కోర్టు ఖర్చుల కింద పిటిషన్ దాఖలు చేసిన డీకే అరుణకు రూ.50 వేలు చెల్లించాలని తీర్పునిస్తూ, డీకే అరుణను గత 2018 డిసెంబరు 12వ తేదీ నుంచి ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments