Publish Date: Mon, 04 Sep 2023 (18:41 IST)
Updated Date: Mon, 04 Sep 2023 (18:43 IST)
గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నికైయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసింది. హైకోర్టు తీర్పు కాపీని జత చేస్తూ సీఈవోకు ఈసీ అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ లేఖ పంపించారు.
డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులను తదుపరి గెజిట్లో ప్రచురించాలని ఆదేశాలు జారీ చేసింది.
గత ఎన్నికల్లో గద్వాల నుండి కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. డీకే అరుణ రెండో స్థానంలో నిలిచారు. నామినేషన్ సందర్భంగా తప్పుడు వివరాల కారణంగా కృష్ణమోహన్ రెడ్డిపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు శిక్షగా రూ.2.50 లక్షలు జరిమానా విధించింది.
సెల్వి
Publish Date: Mon, 04 Sep 2023 (18:41 IST)
Updated Date: Mon, 04 Sep 2023 (18:43 IST)