తెల్లారితే పెళ్లి.. వధువు ఆత్మహత్య.. పెళ్లికి తర్వాత ఉద్యోగం చెయ్యాలన్నాడు..

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (11:00 IST)
తెల్లారితే పెళ్లి జరుగుతుందనగా.. వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రవళి (22) తెలంగాణలోని నవీపేటకు చెందినది. రెండు కుటుంబాల అంగీకారంతో అథీ ప్రాంతానికి చెందిన సంతోష్ తో ఆమెకు వివాహం  జరగాల్సి వుంది. దీని కోసం, పెళ్లికి ముందు రోజు మెహందీ వేడుకను నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమానికి  ఇరు కుటుంబాల బంధువులు కూడా హాజరయ్యారు. ఉదయం పెళ్లి జరుగనుండటంతో అందరూ సంతోషంగా ఉన్నారు. ఆ సమయంలో పెళ్లికొడుకు సంతోష్ వధువు రవళితో మాట్లాడినట్లు తెలుస్తోంది. 
 
పెళ్లికి తర్వాత కూడా ఉద్యోగం చెయ్యాలని.. పెళ్లి తర్వాత ఆస్తిని పంచుకోవాలని వధువుతో అన్నాడు. ఈ వ్యవహారంపై వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన వధువు రాత్రి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంలో వరుడి కుటుంబంపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రవళి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ గ్లింప్స్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు సాన

అడివి శేష్ డెకాయిట్‌ కు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

Samaira: కామాఖ్య నుంచి ఫ్రెండ్షిప్ మెలోడీ సఖీ సాంగ్ రిలీజ్

Adi Sai Kumar: ఆది సాయి కుమార్ కొత్త చిత్రం టైటిల్ సైరాబాను

Bellamkonda Sai : తిరుమలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి వివాహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments