Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసు.. భూమా అఖిలప్రియ అరెస్ట్?

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (12:50 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హఫీజ్‌పేట్‌లోని భూ వ్యవహారమే ఈ కిడ్నాప్‌కు ప్రధాన కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఏపీ మాజీమంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. విచారణ కోసం ఆమెను బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం.
 
ఈ కేసుతో సంబంధం ఉన్న ఆమె భర్త భార్గవ్ రామ్ పరారీలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. భూమా అఖిల ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి ఉన్న నాటి నుంచే ఈ భూ వివాదం కొనసాగుతోందని తెలుస్తోంది. 
 
మరోవైపు ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి బాధితులు ప్రవీణ్ రావుతో పాటు అతడి సోదరులు నవీన్ రావు, సునీల్ రావు వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. మంగళవారం అర్థరాత్రి సీఎం కేసీఆర్ బంధువులైన ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావులను కొందరు దుండగులు కిడ్నాప్‌ చేశారు. 
 
రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారులమంటూ ఆయన ఇంటి లోపలకు వెళ్లారు. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అనంతరం ముగ్గురినీ అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments