Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్, బీజేపీ రెండూ ఎండమావులు వంటివి: మంత్రి హరీష్ రావు

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (19:58 IST)
కాంగ్రెస్, బీజేపీ నాయకులపైన మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. వానాకాలంలో ఉసిళ్లు వచ్చినట్లు వాళ్లు వస్తారని, కానీ టీఆర్ఎస్ మాత్రం ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో దౌల్తాబాద్ మండలంలోని ముబారస్ పూర్‌లో ప్రసంగించిన హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
 
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు విద్యుత్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తే, అటు బీజేపీ వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి తిప్పలు పెడుతోందని విమర్శించారు. ఈ రెండు పార్టీలు ఎండమావులు వంటివని తెలిపారు. వాటి వెంట వెళ్లడం వలన ఏమీ లాభం లేదని తెలిపారు. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ నేత సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్య సమస్యలతో ఆగస్టులో మరణించారు. అక్కడ ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి.
 
ఈ క్రమంలో నవంబరు 3న పోలింగ్ నిర్వహంచనున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తరపున సోలిపేట రామలింగా రెడ్డి సతీమణి సోలిపేట సుజాత, కాంగ్రెస్ పార్టీ తరపున చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునంధనరావు పోటీలో ఉన్నారు. నవంబరు 3న ఎన్నికలు జరుగగా 10న ఫలితాలు రానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments