Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర.. హరీష్ రావు కుట్ర

Webdunia
శనివారం, 18 జూన్ 2022 (16:02 IST)
ఆర్మీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర జరుగుతుందని మంత్రి హరీష్ రావు ఆరోపణలు చేసారు. అందుకే అగ్నిపథ్‌తో ఆర్మీ ఉద్యోగాలకు కేంద్రం మంగళం పాడుతుందన్నారు. రైల్వే స్టేషన్ల దాడుల వెనక  టీఆర్ఎస్ ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తూండటాన్ని హరీష్ రావు తప్పు పట్టారు. 
 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దాడుల వెనుక టిఆర్ఎస్ హస్తం ఉంటే యూపీ లో ఎవరి హస్తం ఉన్నట్లని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్, డి కె అరుణ లు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండి పడ్డారు. అగ్నిపథ్‌ను మార్చా లని అడిగితే యువకులను కాల్చి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అగ్ని‌పథ్ యువతకు అర్థం కాలేదు అనడం హాస్యాస్ప దమని కేంద్రం నిర్ణయంతో దేశంలో అగ్గి అంటుకుందన్నారు. బీజేపీ ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటుందని ఆక్షేపించారు. బీజేపీ అన్ని రంగాలను ప్రయివేట్ పరం చేస్తోంది. చివరికి ఆర్మీని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments