నిజామాబాద్‌లో కవితను పీకేశారు... రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (20:05 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కేసీఆర్ మాటల ముఖ్యమంత్రే తప్ప చేతల ముఖ్యమంత్రి కాదని విమర్శించారు. కేసీఆర్ ఎన్నో మాటలు చెప్తారని  కానీ ఒక్కమాట మీద కూడా నిలబడరని విమర్శించారు. 
 
టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పుకొచ్చారని కానీ చేశారా అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని ఒక్కరికైనా ఇచ్చారా అంటూ నిలదీశారు. 
 
దేవరకొండ నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు రాజాసింగ్. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన  కేసీఆర్ సీఎం అయిన తర్వాత కొడుకుకి ఒక జాబు, అల్లుడుకి ఒక జాబు, కూతురుకి ఒక జాబు ఇచ్చుకున్నారని ఆరోపించారు. అయితే ఇటీవలే నిజామాబాద్ లో ఆ ఉద్యోగాన్ని ప్రజలు పీకేశారని చెప్పుకొచ్చారు.

స్టీరింగ్ పీకేసి అక్కా ఆడుకో అంటూ ఇచ్చేశారని కవిత ఓటమిపై పరోక్షంగా సెటైర్లు వేశారు రాజాసింగ్. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చేశారని విమర్శించారు. రూ.2లక్షల 34వేల కోట్లు అప్పులు చేసి తెలంగాణను అప్పుల ఊబిలో నెట్టేశారని రాజాసింగ్ ఆరోపించారు. 
 
ఆ అప్పు చేసి ఎక్కడ పెట్టావని ప్రశ్నిస్తుంటే జవాబు లేదు, కితాబు లేదంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ అప్పు ఆయన కుటుంబంపై లేదని, ఆయనపైనా లేదన్నారు. తెలంగాణ ప్రజలనెత్తిపై ఉందని చెప్పుకొచ్చారు. 
 
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని దేవరకొండ ప్రజలకు పిలుపునిచ్చారు. తాను మరలా వస్తానని దేవరకొండ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయాలని రాజాసింగ్ ప్రజలను కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ స్టార్ హీరో అనగానే కథ కూడా వినలేదు : రాశీఖన్నా

సెలెబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూసే సంస్కృతి పెరిగిపోతోంది : నటి ఖుష్బూ

ఉగాది పురస్కారాల్లో మూడు అవార్డ్ లు గెల్చుకున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా

హ్యాపీ రాజ్ నుంచి జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ పై అద్దిరా లెక్క సాంగ్ రిలీజ్

'కేడీ: ది డెవిల్' మూవీలోని పాటను తొలగించండి : కేంద్రం ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సాహస యాత్రలపై నాట్స్ అవగాహన సదస్సు

షి ద ఛేంజ్ 2026: హైదరాబాద్‌కు చెందిన శ్రీదేవి జాస్తికి స్విగ్గీ వారు సన్మానం

వేసవిలో పెరుగు, మజ్జిగ: ప్రయోజనాలు ఏమిటి?

భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కోసం సైన్స్-పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాలి: డాక్టర్ అంజిరెడ్డి స్మారక ఉపన్యాసం

శరీర బరువు పెరిగితే వచ్చే వ్యాధులు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments