Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌కు ఆ భ‌యం పట్టుకుంది.. ఎన్ని జిమిక్కులు చేసినా?

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (20:06 IST)
కేసీఆర్‌కు ఓడిపోతాన‌నే భ‌యం ప‌ట్టుకుంది. అందుకే బీజేపీ కార్య‌కర్త‌ల‌పై దాడులు, నాయ‌కుల‌పై త‌ప్పుడు కేసులు పెడుతూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఫైర్ అయ్యారు. అందుకే రాష్ట్రంలో ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని విజయశాంతి మండిపడ్డారు. 
 
కేసీఆర్‌కు ఓడిపోతాన‌నే భ‌యం ప‌ట్టుకుందని ఆమె ఎద్దేవా చేశారు. ప్రతిరోజూ పూర్తి స్థాయిలో రిపోర్టు ఇవ్వాలని అటు ఇంటెలిజెన్స్‎కు, ఇటు డిపార్ట్‎మెంట్లకు కేసీఆర్ సర్కార్ నుంచి ఇంటర్నల్ ఆదేశాలు వెళ్లాయని రాములమ్మ చెప్పారు. 
 
ఈ ఆదేశాలు చూస్తే కేసీఆర్ మ‌ళ్లీ అధికారంలోకి రాడని తేలిపోయిందన్నారు. అందుకే అధికారుల‌ను ఉప‌యోగించుకుని అధికారం నిల‌బెట్టుకోవాల‌ని చూస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. 
 
"కేసీఆర్... నువ్వెన్ని రిపోర్టులు తెచ్చుకున్నా... ఎన్ని జిమ్మిక్కులు చేసినా... నీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజానీకం బంగాళాఖాతంలో కలప‌డం ఖాయం." అని విజయశాంతి హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments