Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిపిల్లలా? పాలు తాగుతున్నారా? మాధవీలత ప్రశ్న

టి.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డిపై బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీలత ఫైర్ అయ్యారు.

Webdunia
శనివారం, 13 అక్టోబరు 2018 (11:32 IST)
టి.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డిపై బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీలత ఫైర్ అయ్యారు. శుక్రవారం ఉదయం బీజేపీలో చేరి.. తిరిగి సాయంత్రానికే అదే వేగంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిపోవడంపై మాధవీలత మండిపడ్డారు. అయినా దేనికోసం ఈ నాటకం అంటూ ప్రశ్నించారు.


నమ్మి ఘనంగా స్వాగతం చెప్పడం బీజేపీ తప్పు కాదు. ఇలాంటి వాటిని కోవర్ట్ పాలిటిక్స్ అంటారంటూ మండిపడ్డారు.  ఇలాంటివి చేయడం కాంగ్రెస్‌కి మాత్రమే చెల్లుతుంది. ఇలాంటి ఉడతా జంప్స్‌కి బీజేపీ కదిలేది లేదు. మోదీ జీ వణికేది లేదంటూ మాధవీ లత ఫేస్‌బుక్‌లో తెలిపారు. 
 
పొద్దున్నే మోదీ జీ ఐడియాలజీ సూపర్.. సాయంత్రం అయ్యేసరికి పోయిందని మాధవీ లత ఎద్దేవా చేశారు. చేరబోయే ముందు ఆలోచన లేదా? పసిపిల్లలా? పాలు తాగుతున్నారా, ఏమీ తెలియకపోవడానికి. పద్మినీ రెడ్డి గారూ చాలా గొప్ప ప్లాన్ తో కోవర్ట్ పాలిటిక్స్ చెయ్యడానికి బీజేపీ లోకి అడుగువేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ ప్లాన్స్ తెలుసుకునేందుకు బీజేపీలో చేరి.. ఆ సాయంత్రానికే ద గ్రేట్ డియర్ హజ్బెండ్ ఉన్న పార్టీలో చేరి చెప్పేశారా? అంటూ మాధవీ లత ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments