Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీపీఐ, సీపీఎంలపై బీజేపీ ఆగ్రహం

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (16:34 IST)
సీపీఐకి నారాయణ చీడ పురుగని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. సీపీఐ, సీపీఎం సిద్ధాంతాలను అమ్ముకున్నాయని, వాటికి ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు.

నామినేషన్స్ ముందు సీపీఐ.‌. నామినేషన్స్ తరువాత సీపీఎం టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నాయని అన్నారు. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది కాబట్టే సీపీఐ, సీపీఎంతో కాళ్ళ బేరానికొచ్చిందని ఆరోపించారు. కమ్యూనిస్టులను కేసీఆర్ ఏవిధంగా మాట్లాడారో ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు.

ఉప ఎన్నికలు అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టగా మారాయని, ఎమ్మెల్సీ పదవి కోసం కమ్యూనిస్టులు ఆశపడ్తున్నారని అన్నారు. సీపీఐ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శులు రాజా, సీతారాం ఏచూరిలకు తాను లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు.

పశ్చిమబెంగాల్, త్రిపుర లానే వామపక్ష భావజాలం ఉన్నవారు బీజేపీకే ఓటు వేస్తారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments